బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

జనంసాక్షి, కమాన్ పూర్ అక్టోబర్ 31 : మంథని నియోజకవర్గం పాలకుర్తి మండలంలోని రాణాపూర్ గ్రామానికి చెందిన బయ్యపు కమలాకర్ రెడ్డి, జాజిమోగ్గుల తిరుపతి యాదవ్, చంటి మైసయ్య, ఆసం దుర్గయ్య, కోడూరి వెంకటేష్, ఇటవేణి కొమురయ్య, పర్లపెల్లి వంశీ, దురశెట్టి మరీన్, నాగుల సతీష్ గౌడ్, సంటి తిరుమల తదితర బీఆర్ఎస్ నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య ఆధ్వర్యంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దుల్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు మొహమ్మద్ ఇబ్రహీం, బామ్లనాయక్ తండా మాజీ ఉపసర్పంచ్ జ్యోతి శంకర్, రాణాపూర్ మాజీ సర్పంచ్ బాలసాని కుమార్ గౌడ్, కన్నాల గ్రామశాఖ అధ్యక్షుడు బుతగడ్డల రమేష్, వేల్పుల రాజ్ కుమార్, సంపంగి కుమార్, పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.