బిజెపికి లగిశెట్టి రాజీనామా..!

బిజెపికి లగిశెట్టి రాజీనామా..!

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 3. (జనంసాక్షి). సిరిసిల్ల బిజెపి రెబెల్ అభ్యర్థిగా బరిలో ఉంటారని స్పష్టం చేసిన లగిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పూర్వ అధ్యక్షుని తీరుపై మండిపడ్డారు. పద్మశాలి సామాజిక వర్గం నుండి తనకు ప్రాధాన్యత ఇస్తామంటూ హామీ ఇచ్చి విస్మరించాలరాని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్నికల ప్రచారంలో ఉండగానే నర్సంపేట నియోజకవర్గం నుంచి రాణిరుద్రమ రెడ్డిని బిజెపి అభ్యర్థిగా ప్రకటించిన పై ఆవేదన వ్యక్తం చేశారు. వెలమ, రెడ్డి సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీల వ్యవహారంపై ప్రజలు ఆలోచించాలని కోరారు. పద్మశాలి సామాజిక వర్గం నుండే కాకుండ అన్ని వర్గాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు తెలిపారు. సమావేశంలో ధ్యావనపల్లి రామకృష్ణ, కుసుమవిష్ణు ప్రసాద్ పలు సామాజిక వర్గాల నేతలు పాల్గొన్నారు