బిజెపి ఓటమి భయంతోనే దాడులు…!

టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు బుస అశోక్ యాదవ్

ఖానాపురం నవంబర్ 1జనం సాక్షిమునుగోడులో ఓటమి భయంతోనే బిజెపి నాయకులు టిఆర్ఎస్ నాయకుల పై దాడులు చేస్తున్నారనిటిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భూస అశోక్ యాదవ్అన్నారు.
మంగళవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఈ నెల 3వ తేదీన జరిగే మునుగోడు ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలవుతుందని టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై బిజెపి నాయకులు, కార్యకర్తలు దాడి చేయడం అప్రజస్వామికమన్నారు.
చివరి రోజు ప్రచారానికి మంత్రి కేటీఆర్ వస్తుండగా రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ లు టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించుకుంటూ వెళ్తుండగా బిజెపి పార్టీ ముసుగులో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గుండాలు, కార్యకర్తలు చేసిన దాడుల్లో వారు గాయపడ్డారని ఈ దాడి చాలా బాధాకరమన్నారు. ఈ దాడికి కారణమైనటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు తగిన మూల్యం చెల్లిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజగోపాల్ రెడ్డి ఓటమిని జీర్ణించుకోలేక తన ప్రచారానికి వచ్చిన ఈటల రాజేందర్ కార్యకర్తలను దాడికి పుసి గొలిపి ఆప్రజాస్వామిక చర్యలకు పాల్పడడం బిజెపికే చెల్లిందని అన్నారు.అయినా మునుగోడు ప్రజలు వివేకవంతులని జరిగిన పరిమాణాలను గమనిస్తూ ఈ ఎన్నికల్లో బిజెపికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ జాటోత్ సదర్ లాల్, బీసీ సెల్ మండల అధ్యక్షులు కోరే సుధాకర్, రంగాపురం గ్రామ పార్టీ అధ్యక్షులు బందారపు శ్రీనివాస్ గౌడ్, వార్డ్ మెంబర్ కోరే రాము, దుడ్డు విజేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.