బిజెపి పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి

బిజెపి పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి

పెన్ పహాడ్ అక్టోబరు 30 (జనం సాక్షి) :
బిజెపి పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు సోమవారం మండల పరిధిలోని జాన రెడ్డి నగర్ మమదాపురం ధర్మపురం రంగయ్య గూడెం గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందాయని తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడిచిన అభివృద్ధి శూన్యమని అన్నారు, బడుగు బలహీన వర్గాలను మోసం చేసింది బిఆర్ఎస్ పార్టీ అన్నారు, రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు, ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పోకల రాములు, పోగల వెంకటేశ్వర్లు, తుంకోజ్ వెంకటేశ్వర్లు, అక్కడికి బిట్టు వెంకన్న, బిట్టు రమేష్, గురువయ్య, రాములు, కనుక నరసయ్య, వీరయ్య, నాగయ్య, పెండ ముత్తయ్య, చెన్ను రమణారెడ్డి, బైరెడ్డి రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.