బిజెపి పార్టీతోనే నియోజకవర్గ అభివృద్ధి: దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు.

రైతు బతికి ఉన్నప్పుడు రుణమాఫీ కావాలా, చనిపోయాక రైతు బీమా కావాలా.

దౌల్తాబాద్ అక్టోబర్ 27, (జనం సాక్షి ).

మండల పరిధిలో గొడుగుపల్లి, లింగయ్యపల్లి తండా గ్రామాలలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే, బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు కు ప్రజలు డప్పు చప్పుళ్ళు, మంగళహారతులు, బోనాలతో మహిళలు ఘన స్వాగతం పలికారు.రాష్ట్ర ఏర్పాటు అనంతరం యువతకు ఉద్యోగాలు వస్తాయని కొట్లాడడం జరిగిందని, స్వరాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం రాలేదని వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కు మద్యంపై ఉన్న ధ్యాస యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో లేదన్నారు. గెలిచిన నన్ను రెండున్నరేళ్లు దీవించారని మరోసారి మీ ఆశీర్వాదంతో కమలం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరారు.అనంతరం గొడుగుపల్లి, లింగాయపల్లి తండా గ్రామాలలో పలు పార్టీలకు చెందిన యువకులు ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు.దీపాయంపల్లి గ్రామంలో పెద్దమ్మ,పెద్దిరాజుల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోతరాజు కిషన్, లింగయపల్లి తండా సర్పంచ్ దేవి యాదగిరి,జిల్లా కార్యవర్గ సభ్యులు కుమ్మరి నర్సింలు, జిల్లా అధికార ప్రతినిధి కౌకూరి యాదగిరి, బిజెపి సీనియర్ నాయకులు భూపాల్ రెడ్డి, రామస్వామి గౌడ్, గడ్డమీది స్వామి, ముత్యాల శ్రీనివాస్,ప్రవీణ్, రంజిత్ గౌడ్,నరసింహారెడ్డి, అనిల్ రెడ్డి,సుచిత్ గౌడ్,నవీన్ గౌడ్,లక్ష్మణ్, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.