బిల్లు అడిగినందుకు ఓనర్‌ను చంపేశారు

బెంగాల్‌ హోటల్లో దారుణ ఘటన

కోల్‌కతా,జూన్‌5(జనం సాక్షి ): కడుపునిండా బిర్యాని తిని ,తిన్నదానికి డబ్బులు చెల్లించాలని అడిగినందుకు పశ్చిమ బెంగాల్‌లో ఓ ¬టల్‌ యాజమానిని దారుణంగా హత్య చేశారు. నలుగురు కస్టమర్లు ప్లేట్‌కు తలో రూ.190 చెల్లించాలని అతడు కోరడంతో ఆ ఘటనకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బిర్యాని తిన్న తరువాత డబ్బులు చెల్లించాలని ¬టల్‌ యాజమాని సంజయ్‌ మండల్‌ నలుగురు కస్టమర్లను కోరాడు. దీంతో కస్టమర్లు, సంజయ్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సహనం కోల్పోయిన ఒక కస్టమర్‌ అతడి దగ్గరున్న తుపాకీతో సంజయ్‌పై కాల్పులు జరిపాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన 24పరగణన జిల్లాలో జరిగినట్లు వారు వెల్లడించారు. బిర్యానీ ధరపై ఈ గొడవ జరిగిందా? లేక మరే ఇతర కారణాలను దృష్టిలో ఉంచుకొని నిందితుడు కాల్పులు జరిపాడా? కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం. నలుగురిలో ఒకరిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.