బిసి అభ్యర్థులను గెలిపించుకుంటాం..! – బీసీ సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు పిల్లి చంద్రశేఖర్ ముదిరాజ్

జనంసాక్షి ,మంథని, అక్టోబర్ 28 : రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా తాము ముందుకు సాగుతామని బీసీ సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు పిల్లి చంద్రశేఖర్ ముదిరాజ్ పేర్కొన్నారు. శనివారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముందుగా మంథని నియోజకవర్గ బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షుడిగా పెద్దపల్లి మహదేవును ఏకగ్రీవంగా నియమించినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంథని డివిజన్లోని అన్ని బీసీ సంఘాలను ఏర్పరచుకొని బీసీ సంఘాల జేఏసీగా ఏర్పడడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో బీసీలను గెలిపించుకునే దిశగా తాము ముందుకు సాగుదామని ఆయన పేర్కొన్నారు. మంథని నియోజక వర్గంలోని బీసీలను పూర్తిస్థాయిలో కలుసుకొని నియోజకవర్గంలోని బీసీలకు మద్దతు తెలుపుతూ గెలిపించుకుందామని ఆయన తెలిపారు. మంథని నియోజక వర్గ బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షుడిగా పెద్దపల్లి మహదేవ్, ఉపాధ్యక్షులుగా ఆత్మకూరి స్వామి యాదవ్, పెండ్యాల రామ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా విజయగిరి సమ్మయ్య, కోశాధికారిగా చాట్లపల్లి తిరుపతి, కార్యదర్శులుగా తిరుపతి, పెరుమండ్ల అనిల్ గౌడ్, రెడ్డి శేఖర్ సహాయ కార్యదర్శులుగా పోత వెంకట స్వామి, మంథని రఘువీర ప్రసాద్,ప్రచార కార్యదర్శిగా గొల్లపెల్లి రాయమల్లు లను నియమించినట్టు ఆయన పేర్కొన్నారు. నియోజక వర్గంలో బిసి బిడ్డను గెలుపుకునేందుకు తాము సంపూర్ణంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి రఘువీర్ ప్రసాద్ కట్టెకోల పర్వతాలు యాదవ్, బొల్లం రవీందర్ గౌడ్, పెంచాల రమ్య యాదవ్, సమ్మెట స్వప్న, జక్కుల సతీష్, చాట్లపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.