బిహార్లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
హైదరాబాద్: బిహార్ రాష్ట్రం నలందా జిల్లా సక్రాల్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతులు నితీష్కుమార్, సంజయ్ కుమార్లుగా పోలీసులు గుర్తించారు. వారంతా ఓ శుభకార్యానికి హాజరై కారులో వస్తుండగా, కారు అదుపు తప్పి ఆగి ఉన్న బస్సుని ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు దీప్నగర్ పోలీస్శాఖ ఎస్హెచ్వో రాజనందన్ ప్రసాద్ తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.