బి ఆర్ ఎస్ కు హరిగోపాల్ శర్మ రాజీనామా..

అతి త్వరలో కాంగ్రెస్పార్టీ లో చేరిక..

ఇల్లందు అక్టోబర్ 27 (జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన తెలంగాణ మొదటి ఉద్యమకారుడు హరి గోపాల్ శేర్మ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఒక ప్రకటనలో హరి గోపాల్ శర్మ మాట్లాడుతూ.. నేను తెలంగాణ రాష్ట్రం కావాలని టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావo నుండి ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నానని, ఉద్యమ వాళ్ళలో పాల్గొని జైలుకు వెళ్లి, కేసులు బుక్ అయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చానని అన్నారు. బిఆర్ఎస్ పార్టీలో నీతి నిజాయితీగా పనిచేసిన ఉద్యమకారులకు తగిన గుర్తింపు లేదని పార్టీ విడుదల చేసిన మేనీపొస్టులో కూడా ఉద్యమకారుల కు సంబంధించిన హామీల పూసే లేదని, ఉద్యమకారుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం నడుస్తున్నందున మనస్థాపానికి గురై బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.