బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న మల్లికార్జునపల్లి కాంగ్రెస్ నాయకులు

ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పోచారం యాదమ్మ, పోచారం సురేష్, కర్చర్ల కేశవ రావు, మ్యాతారి కుమార్, తాలెల్మ పెద్ద మల్లయ్య, యేసు, చిన్న మల్లయ్య తదితరులు లకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికలు యువనాయకుడు కార్తీక్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వార్డు మెంబర్ రాజు, నాయకులు కుమార్, బుచ్చయ్య, నగేష్,లింగయ్య, బాబు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.