బీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరికలు

జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 28 : మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి బీఆర్ఎస్‌ పార్టీలోకి బారీ చేరికల పర్వం కొనసాగుతోంది. పాలకుర్తి మండలం కన్నాల గ్రామపంచాయతీ బోడగుట్టపల్లి బీజేపీ నాయకుడు, వార్డ్ మెంబర్, గౌడ సంఘం అధ్యక్షుడు బుర్ర సది గౌడ్, 20 మంది బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా వారికి మంథని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ కండువా కప్పి భీఆర్ ఎస్ పార్టీ లోకి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో కన్నాల సింగిల్ విండో చైర్మన్ బయ్యపు మనోహర్ రెడ్డి తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.