బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన అంబేద్కర్ సంఘం నాయకుడు

జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 28 : మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి బీఆర్ఎస్‌ పార్టీలోకి బారీ చేరికల పర్వం కొనసాగుతోంది. కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుక్క చంద్రమౌళి శనివారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా వారికి మంథని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ కండువా కప్పి భీఆర్ ఎస్ పార్టీ లోకి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఇనుగంటి రామారావు, జూలపల్లి సర్పంచ్ బొల్లపల్లి శంకర్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు బొల్లపల్లి లక్ష్మయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.