బీఆర్ఎస్ లోకి పాతగూడూరు బీజేపీ సీనియర్ నేత

బీఆర్ఎస్ లోకి పాతగూడూరు బీజేపీ సీనియర్ నేత

ధర్మపురి (( జనం సాక్షి)ఎండపల్లి మండలం పాతగూడూరు బీజేపీ సీనియర్ నాయకుడు పొనుగోటి యుగంధర్ రావు తన అనుచరులతో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ ఎస్ లో చేరారు. రాష్ట్రం లో బీఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ప్రజలకు శ్రీరామ రక్షగా ఉన్నాయని చెప్పారు. ధర్మపురి నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ ను అత్యధిక మెజారిటీ తో గెలిపించు కుంటామని చెప్పారు. పార్టీ లో చేరిన వారికి మంత్రి కొప్పుల ఈశ్వర్ గులాబీ కండువా కప్పారు. బీఆర్ ఎస్ లో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. అభినందించారు.