బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్

ఆదివారం తెలంగాణ భవన్లో ఎర్ర శేఖర్ కు మంత్రి
కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా, జడ్చర్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్
టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, మరోనేత
అనిరుధ్ రెడ్డి పోటీపడ్డారు. చివరికి అనిరుధ్ రెడ్డికి టికెట్ దక్కడంతో ఎర్రశేఖర్ వర్గం ఆగ్రహం కట్టలు
తెచ్చుకుంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు
చేశారు. టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి
గురైన ఎర్రశేఖర్ అనుచరులు, నాయకులు,
కార్యకర్తలతో తన నివాసంలో సమావేశమై కాంగ్రెస్
రెబల్గా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు.

ఈక్రమంలో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి పార్టీలోకి
రావాలని ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి
కేటీఆర్ సమక్షంలో ఎర్ర శేఖర్ ఆదివారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.