బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశం ప్రారంభం

బెంగళూరు, ఏప్రిల్‌ 3 : బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశాలు శుక్రవారం ఉదయం బెంగళూరులో ప్రారంభమయ్యాయి. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా సహా కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు హాజరయ్యారు. ప్రధాని మోదీ జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాలను ప్రారంభించారు. నేటి నుంచి రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.