బీజేపీ దీక్ష భగ్నం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (జనంసాక్షి):
విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నాలుగు రోజులుగా బిజెపి ఆధ్వ ర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలను మంగళవారం సాయంత్రం పోలీసులు భగ్నం చేశారు. ఇప్పటికే బిజెపి ఎమ్మెల్యేల ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. నిజామాబాద్‌ ఎమ్మెల్యే ఎండల లక్ష్మినారాయణ ఆరోగ్యం క్షిణించింది. బిపి, షుగర్‌ లెవెల్స్‌ పడిపో వడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గుర య్యా రు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా నీరసానికి లోనైయ్యారు. చికిత్స కోసం ఆసుప త్రిలో చేరాల్సిందిగా వైద్యులు సూచించి నప్పటికీ బిజెపి నేతలు నిరాకరించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పోలీసులకు నివేదిక ఇచ్చారు. అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్పించాలని సూచించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి దీక్షను భ్నగం చేసి బిజెపి నేతలను ఆసుపత్రికి తరలించారు.