బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

జనం సాక్షి, జూన్ 08,పానుగల్
జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనపై రాష్ట్ర బిజెపి పార్టీ దర్యాప్తు జరపాలని, అదేవిధంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో బిజెపి పార్టీ శ్రేణుల ను బుధవారం ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది .ఈ సందర్భంగా  దళిత మోర్చా మండల అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ అక్రమ అరెస్టుల కు భయపడని పార్టీ బిజెపి పార్టీ అని అత్యాచార బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. ముందస్తుగా అరెస్టయినవారిలో దళిత మోర్చా అధ్యక్షుడు తో పాటు శక్తి కేంద్రం ఇంచార్జ్ అజయ్, బూత్ కమిటీ అధ్యక్షులు రాములు, బూత్ కమిటీ సభ్యుడు కురుమూర్తి ఉన్నారు.