బీజేపీ పార్టీలోకి చేరికలు.

దౌల్తాబాద్ అక్టోబర్ 29, (జనం సాక్షి )

దౌల్తాబాద్ మండల పరిధిలో ముబారస్ పూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ వార్డ్ సభ్యులు కోటి లక్ష్మి, నిరుడి నర్సవ్వ, పంజా స్వరూప, పయవ్వుల అనురాధ, ముత్యంపేట గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు తొడంగి రాజు, జంగం బాలయ్య, పంచమి రాజు లు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ లో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరోసారి దుబ్బాకలో బిజెపి విజయం సాధించడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోతరాజు కిషన్, మండల ఉపాధ్యక్షులు గడ్డమీది స్వామి, కోనాయిపల్లి సర్పంచ్ సురేందర్ రెడ్డి, ముబారస్పూర్ ఉపసర్పంచ్ స్వామి, మండల కార్యదర్శి లక్ష్మణ్, బూత్ అధ్యక్షులు చంద్రం, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.