బీజేపీ పార్టీలోకి చేరికలు.

బీజేపీ పార్టీలోకి చేరికలు

దౌల్తాబాద్ నవంబర్ 3, (జనం సాక్షి )దౌల్తాబాద్ మండల పరిధిలో కోనాపూర్, ఇంందుప్రియల్ గ్రామాలకు చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ లో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరోసారి దుబ్బాకలో బిజెపి విజయం సాధించడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోతరాజు కిషన్, మండల ఉపాధ్యక్షులు గడ్డమీది స్వామి,కోనాపూర్ సర్పంచ్ పంచమి స్వామి,ముబారస్పూర్ ఉపసర్పంచ్ స్వామి, మండల కార్యదర్శి లక్ష్మణ్, బూత్ అధ్యక్షులు రమేష్ ,నాయకులు సత్యనారాయణ గౌడ్, అనిల్ రెడ్డి, రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.