*బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉషా దయాకర్

దేవరుప్పుల,అక్టోబర్ 29(జనం సాక్షి):* దేవరుప్పుల మండల కేంద్రంలో నూతన బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఉషా దయాకర్ ప్రారంబించారు.పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించక ముందు హనుమాన్ దేవాలయం లో ఉషా దయాకర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఎర్రబెల్లి చారిటేబుల్ ట్రస్ట్ ఛైర్పర్సన్ ఉషమ్మకు మండల పార్టీ అధ్యక్షులు తీగల దయాకర్ అధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఘనస్వాగతం పలికారు.తదనంతరం ఉషమ్మ మాట్లాడుతూ..కార్యకర్తలు ఈ నెల రోజులు కష్టపడి పనిచేసే పాలకుర్తిలో గులాబీ జెండా రెపరెపాపడుతుందని ,ధయన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ మండల అధ్యక్షులు తీగల దయాకర్,ఎంపీపీ బస్వా సావిత్రి,జిల్లా నాయకులు పల్ల సుందర్ రాంరెడ్డి,గ్రామ సర్పంచ్ ఈదునూరి రమా నర్సింహ రెడ్డి,కార్యకర్తలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.