బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం

కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొని 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి గాయాలపాలయ్యారు. బెంగాల్లోని బర్ద్వాన్-కత్వాల్ రహదారి గుండా వెళుతున్న బస్సుపై ఓ మూలమలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. బస్సు ఒక్కసారిగా రోడ్డు దిగిపోయి బోల్తాపడింది. దీంతో అధిక ప్రాణనష్టం చోటుచేసుకుంది. అందులో మొత్తం 70 మంది ప్రయాణికులు ఉన్నారు. నదియా జిల్లాలోని మాయాపూర్ నుంచి వస్తున్న ఆ బస్సు మితిమీరిన వేగం కారణంగానే పడిపోయిందని అధికారులు ప్రాథమికంగా తేల్చేశారు.