బోరు బావిలో పడిన బాలుడు మృతి..

చెన్నై : వేలూరు జిల్లా ఉప్పుపేటలో బోరు బావిలో పడిన తమిళ్ అరసన్ (2) మృతి చెందాడు. బావిలో నుండి వెలికి తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చిన్నారి మృతి చెందాడు. దీనితో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది అరసన్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.