బ్యాంకు సొమ్ము రూ.కోటిన్నర స్వాదీనం

విశాఖపట్నం:విశాఖపట్నం సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సీతంపేట శాఖలో గల్లంతైన సుమారు కోటిన్నర(1,48,99,000)రూపాయల నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.ఆ బ్యాంకు ఉద్యోగి అభయానంద్‌ పాశ్వాస్‌ను నిందితుడిగా గుర్తించారు.ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ పూర్ణచంద్రరావు వివరాలు తెలిపారు.బ్యాంకు సొమ్మ సుమారు కోటిన్నర చోరీకి గురైనట్టు గుర్తించిన అధికారులు గత నెల 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిందితులను పట్టుకోడానికి కమిషనర్‌ స్పెషల్‌ టీం ఏర్పాటు చేశారు.వారు బ్యాంకు నుంచే తమ విచారణ ప్రారంభించారు. బ్యాంకులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజిని పరిశీలించారు. నిందితుడు దొరికిపోయాడు. ఈ బ్యాంకులోనే పని చేస్నున్న అభయానంద పాశ్వాస్‌ దపదపాలుగా సోమ్ము తస్కరించినట్లు గుర్తించారు.విచారణలో ఆ సోమ్మును వేరే వూర్లో తన మిత్రుడి ఇంట దాచి పెట్టినట్లు నిందితుడు వెల్లడించాడు. తక్కువ సమయంలోనే నిందితుడిని పట్టుకున్నాందుకు సీపీ వారిని అబింనందించారు. వారికి త్వరలోనే రివార్డులు ప్రకటిస్తామన్నారు.