భగత్సింగ్ సమాధివద్ద అన్నా నివాళి
పంజాబ్ ,్వల్యీరకూఱతీవూుూు: జలియన్వాలాబాగ్లోని భగత్సింగ్ ఘాట్ వద్ద మంగళవారం సామాజిక కార్యకర్త అన్నా హజారే నివాళులర్పించారు. జనంతంత్ర యాత్రలో భాగంగా ఆయన మంగళవారం జలియన్వాలాబాగ్కు చేరుకున్నారు. మొదట భగత్సింగ్ ఘాట్ వద్దకు చేరుకుని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భగత్సింగ్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. స్వాతంత్య్రం కోసం భగత్సింగ్ చేసిన త్యాగాలను కొనియాడారు. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. దేశమంతా పర్యటించి ప్రజలను చైతన్య వంతులను చేస్తానని, అవినీతిని అంతమొందించే వరకూ పోరాటం సాగిస్తానన్నారు.