భద్రతా బలగాలపై రాళ్లదాడి

శ్రీనగర్‌,జూన్‌4(జ‌నం సాక్షి ): జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుల్వామా జిల్లాలోభద్రతా వాహనాలపై స్థానికులు రాళ్ల దాడి చేశారు. ఈ మధ్యే తాంగ్‌ధర్‌ సెక్టార్‌లో ఐదుగురు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ఒక ఉగ్రవాది పుల్వామాకు చెందిన వ్యక్తి. దీంతో పుల్వామాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కనిపించిన ప్రతి పోలీస్‌, ఆర్మీ వాహనాలపై ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. దీంతో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఆందోళన కారులు రాళ్లు రువ్వవద్దన్నారు.