భద్రాచలంలో కన్నుల పండువగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం

మరి కాసేపల్లో భద్రాచలంలో వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనుంది. సీతారాముల కల్యాణోత్సవానికి భారీగా భక్తులు తరలిరావడంతో ప్రభుత్వం 1200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.