భద్రాచలం దగ్గర గోదావరి జలకళ

గోదావరిలో ప్రస్తుత నీటి మట్టం 19.5 అడుగులకు చేరిందని సీడబ్ల్యూసీ వర్గాలు తెలిపాయి. వరద నీటి కారణంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రెండవ గోదావరి బ్రిడ్జి పనులు నిలిచిపోయాయి. ఇప్పటికే జిల్లా యంత్రాంగం గోదావరి వరదలపై సమీక్షా సమావేశం నిర్వహించింది. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గోదావరి నది వరద క్రమంగా స్నానఘట్టాల వరకు చేరుకోవడంతో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.