భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి: సంకినేని వెంకటేశ్వరరావు

భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి: సంకినేని వెంకటేశ్వరరావు

పెన్ పహాడ్ అక్టోబరు 30 (జనం సాక్షి) : భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యాపేట బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు, ఆయన నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ ప్రచార యాత్ర సోమవారం మండల పరిధిలోని జానా రెడ్డి నగర్లో ప్రారంభమై మహమ్మాదాపురం, మేఘ్య తండా, లాల్ సింగ్ తండా, భాగ్య తండా, మూన్య తండా, కేవల తండా, ధర్మపురం వరకు కొనసాగింది ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రజలతో మమేకమై విస్తృత ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గెలిపిస్తే మహమ్మదాపురం నుండి అనంతరం క్రాస్ రోడ్ వరకు ఉన్న మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మారుస్తానని స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలను రాష్ట్ర ప్రజలు చూశారని మాట ఇచ్చి తప్పిన కేసీఆర్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు, అంతకుముందు మహ్మదాపురంలోని ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆయన  సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కొంతమంది బిజెపి పార్టీలో చేరగా పార్టీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కట్కూరి కార్తీక్ రెడ్డి, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పోకల రాములు, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి మధు, మండల ఇంచార్జ్ పోకల వెంకటేశ్వర్లు, మండల మహిళా అధ్యక్షురాలు మామిడి సంధ్య, నాయకులు చెన్ను రమణారెడ్డి, తుంకోజ్ వెంకటేశ్వర్లు, లకావత్ ఈరన్న, గాయం వెంకట్ రెడ్డి, సురభి హరికృష్ణ, మామిడి సోమయ్య,మామిడి సందీప్, బిట్టు వెంకన్న, బిట్టు రమేష్, గురువయ్య, రాములు, కనుక నరసయ్య, వీరయ్య, నాగయ్య, పెండెం ముత్తయ్య, బైరెడ్డి రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు