భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమావేశం నిర్వహించిన:కుమార్ సొగలా..

ధర్మపురి (జనం సాక్షి) ధర్మపురి పట్టణ కేంద్రంలో కర్నేఅక్క పెళ్లి ఫంక్షన్ హాల్ శనివారం భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమావేశం కు ధర్మపురి నియోజకవర్గ అభ్యర్థి కుమార్ సొగలా ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం లో మీడియాతో మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ప్రకారం ఇంటింటికి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేస్తామని, ధర్మపురి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని రెండు పార్టీలను ప్రజలు నమ్మలేరని మేడిగడ్డ కృంగిపోయినట్లు బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కృంగిపోతున్నాయని కుమార్ సోగలా ఎద్దేవా చేశారు. నియోజకవర్గ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారని సూచించారు, నరేంద్ర మోడీ నాయకత్వంలో మంత్రి వర్గంలోకి 27 మంది మైనార్టీలను 12 మంది ఎస్సీలను మంత్రివర్గంలో 6 ఆరుగురు.గవర్నర్ లను ఎనిమిది మంది మహిళలను మంత్రివర్గంలో తీసుకున్నట్లు ఆయన సూచించారు, అంతకుముందు కుమార్ సొగలా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాని దర్శించుకున్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.