భారత్‌కు అమెరికా స్వాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌లు

78వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా భార‌త ప్ర‌జ‌ల‌కు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. భార‌త్‌-అమెరికా మ‌ధ్య   బంధం ఉంద‌న్నారు. భార‌త ప్ర‌జ‌ల సంప‌న్న‌మైన, వైవిధ్య‌మైన చ‌రిత్ర‌ను గుర్తు చేసుకుంటూ ఆగ‌స్టు 15 స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని అమెరికా కూడా నిర్వ‌హించుకుంటోంద‌ని బ్లింకెన్ వ్యాఖ్యానించారు.    ఈ సంద‌ర్భంగా ఇరు దేశాల మ‌ధ్య ఉన్న సంబంధాల‌ను ఆయ‌న కొనియాడారు. ఈ ఆగ‌స్టు 15 సంద‌ర్భంగా అమెరికా త‌ర‌ఫున భార‌త ప్ర‌జ‌ల‌కు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.