భారీ వర్షానికి కూలిన ఇల్లు

వ్యక్తిని కాపాడి
మానవత్వం చాటుకున్న కౌన్సిలర్ గాదె విజయలక్ష్మి తిరుపతి
:జూలై 12 (జనంసాక్షి ) గత మూడు రోజులుగా ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు వల్ల ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని తొమ్మిదవ వార్డు పరిధిలోని గోపని రాములకు చెందిన ఇల్లు మంగళవారం మధ్యాహ్నం పెద్ద చప్పుడుతో కూలిపోయింది. చుట్టుపక్కల వారు ఆ శబ్దం విని వెంటనే వార్డు కౌన్సిలర్ కు సమాచారం అందించారు. వార్డు కౌన్సిలర్ గాదే విజయలక్ష్మి తిరుపతి భర్తతో వచ్చి ఆ ఇంట్లో ఉన్న వృద్ధున్ని కాపాడి ఎత్తుకొని బయటకు తెచ్చినారు. తన సొంత డబ్బుతో ఇల్లు అద్దెకి తీసుకొని అతన్ని అద్దె ఇంట్లో చేర్పించారు. మరియు తినడానికి పాలు, బ్రెడ్ ప్యాకెట్ అందించారు.వార్డు కౌన్సిలర్ భర్త తిరుపతి స్పందించిన తీరు సమయస్ఫూర్తికి అతని మానవత్వానికి పలువురు యువకులు కాలనీవాసులు అభినందించారు