భూకంపం వల్ల భారత్ లో 62 మంది మృతి..

ఢిల్లీ : భూకంపం వల్ల భారత్ లో 62 మంది మృతి చెందినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జై శంకర్ తెలిపారు. 259 మంది గాయాలయ్యాయన్నారు. బీహార్ లో 46 మంది..యూపీలో 13 మంది..బెంగాల్ లో ఇద్దరు..రాజస్థాన్ లో ఒకరు మృతి చెందారన్నారు. నేపాల్ లో ఇద్దరు భారతీయులు మృతి చెందినట్లు జై శంకర్ పేర్కొన్నారు.