భూకంప మృతులకు సంతాపం తెలిపిన మంత్రి జాన్‌కెర్రీ

వాషింగ్టన్‌, జనంసాక్షి: ఇరాన్‌, పాకిస్థాన్‌ భూకంపానికి మృతి చెందిన కుటుంబాలకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్‌కెర్రీ సంతాపం ప్రకటించారు. భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన ఇరాన్‌, పాకిస్థాన్‌ దేశాలకు అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. భూకంపానికి ఇరాన్‌లో 40 మందికి పైగా, పాకిస్థాన్‌లో 34 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.