భూసేకరణ బిల్లును కావాలనే అడ్డుకుంటున్నారు : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు

i64wvyzkజార్ఖండ్‌, మార్చి 30 : భూ సేకరణ బిల్లును ప్రతిపక్షాలు కావాలనే అడ్డుకుంటున్నాయని కేంద్రమంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూ సేకరణ బిల్లును ప్రతిపక్షాలు కేవలం అడ్డుకోవాలన్న ఆలోచనతోనే అడ్డుకుంటున్నాయని, బిల్లుపై ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలో దమ్ము లేదని అన్నారు. బిల్లులో తొమ్మిది సవరణలు తీసుకువచ్చామని, వాళ్ల అనుమానాలు నివృత్తి చేశామని, అయినా ప్రతిపక్షాలు బిల్లును అడ్డుకుంటున్నాయని వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ఒక వేళ భూ సేకరణ బిల్లుకు ఆమోదం లభించకుంటే రైతులకు నాలుగురెట్ల నష్టపరిహారం అందదని ఆయన స్పష్టం చేశారు.