మంత్రి కే తారకరామారావు ప్రెస్ కాన్ఫరెన్స్సిరిసిల్ల

• మా ముఖ్యమంత్రి, రైతు బిడ్డ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పంటలు భారీ ఎత్తున సాగవుతున్నాయి
• లక్ష 35 వేల ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయి
• 2015 నుంచి ఈరోజుకి సుమారు 50 లక్షల అదనపు ఎకరాలు సాగులోకి వచ్చింది. రైతుబంధు రైతు బీమా సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడం వంటి కార్యక్రమాల వలనే ఇది సాధ్యమైంది. కానీ కేంద్రమంత్రి పీయుష్ గోయల్ అవహేళనగా మాట్లాడారు
• తెలంగాణలో వ్యవసాయం పండగ మారుతుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు భాదను కలిగిస్తున్నాయి
• కేంద్ర ప్రభుత్వం రైతుల మీద కత్తి కట్టింది. రైతులను రైతు కూలీలుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తుంది. కార్పొరేట్ కంపెనీలకు వ్యవసాయం అప్పజెప్పెందుకు ప్రయత్నం చేస్తున్నది
• కేంద్రం వ్యవసాయాన్ని, కరెంటును కార్పొరేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తుంది
• ఇదే విషయాన్ని పదేపదే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇప్పుడు అదే విషయం నిజమవుతున్నది
• కేంద్రం అన్ని రంగాల్లోని సంస్థలు ఆమ్ముతున్నది
• చివరికి ధాన్య సేకరణ అంశాన్ని కూడా ప్రవేట్ పరం చేయబోతున్నది
• పంటలు సేకరించే పని నుంచి కేంద్రం తప్పించుకుంటుంది.ఆహార భద్రత చట్టం ప్రకారం ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత కేంద్రాన్ని అయితే దాని నుంచి కూడా తప్పించుకుంటుంది
• విద్యుత్ రంగాన్ని కచ్చితంగా ప్రవేటుపరం చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ముందుకు పోతున్నది.
• దేశ పరిస్థితుల పైన అవగాహన లేకుండా నల్ల చట్టాలను తీసుకువచ్చి, 700 మంది రైతులను చంపిన తర్వాత, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పిన నరేంద్ర మోడీకి బుద్ధి మారలేదు.
• అనాలోచిత అసమర్ధ నిర్ణయాలతో వ్యవసాయం మరియు విద్యుత్ రంగాన్ని దివాలా తీయించే ప్రయత్నం చేస్తున్నారు
• నరేంద్ర మోడీ పాలనలో నైజూరియా కన్నా ఎక్కువ మంది పేదలు భారతదేశంలో ఉన్నారు.బంగ్లాదేశ్ పాకిస్తాన్ కన్నా దారుణంగా హంగర్ ఇండెక్స్ లో భారత్ కి స్థానం దక్కింది
• కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లనే వ్యవసాయం సంక్షోభంలో పడుతున్నది

• కేంద్ర ప్రభుత్వ విధానాల వలన రైతులు తమ సొంత పొలాల్లోనే కూలీలుగా మారే పరిస్థితి వచ్చింది ఈ విషయాన్ని రాష్ట్రం తో పాటు దేశంలోని రైతన్నలంతా గుర్తించాలి
• ప్రజలతో ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంటుతో సంబంధం లేకుండా విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ పంపిణీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నం చేస్తుంది
• తన కార్పొరేట్ మిత్రులకు అప్పచెప్పడానికే నరేంద్ర మోడీ ఈ ప్రయత్నం చేస్తున్నారు
• అందుకే 3 వేల రూపాయల సింగరేణి బొగ్గును కాదని 35 వేల ఆస్ట్రేలియన్ బొగ్గును కొంటున్నారు. ఇది తన కార్పొరేట్ మిత్రులు చేస్తున్న బొగ్గు వ్యాపారం కోసమే. విద్యుత్ ఉత్పత్తి సంస్థలను దీవాల తీయించడం కోసమే ఇదంతా చేస్తున్నారు
• తన కార్పొరేట్ మిత్రుడిని ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలోకి తీసుకుపోవడం కోసం దేశంలోని వ్యవసాయ, విద్యుత్ రంగాన్ని ఫనంగా పెట్టి దివాళ తీయించే లక్ష్యంతో ప్రధానమంత్రి మోడి పని చేయిస్తున్నారు
• అందుకే ఆయన కోసం శ్రీలంక వంటి దేశాల్లో కార్పొరేట్ మిత్రుని తరఫున పైరవీ చేశారు
• కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే నూతన విద్యుత్ బిల్లులను అడ్డుకుంటామని శాసనసభ సాక్షిగా చెప్పినము
• బిల్లు చట్టంగా మారితే రైతన్నల ఉచిత కరెంటుతోపాటు దళిత, గిరిజన, రజక, నాయి బ్రాహ్మణ వంటి వృత్తుల వారికి, కొన్ని పరిశ్రమలకు ఇచ్చే సబ్సిడీ విద్యుత్ కూడా పోతుంది
• రాష్ట్ర విద్యుత్ సంస్థలకు రుణాలు రాకుండా చేసి వాటిని దివాల తీయించే ప్రయత్నం కేంద్రం చేస్తున్నది
• ఎందుకు కేంద్రం దొడ్డి దారిన గెజిట్లను విడుదల చేస్తున్నది…? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
• కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలు అమలులోకి వస్తే అత్యధికంగా నష్టపోయేది తెలంగాణ రాష్ట్రంమే
• రాష్ట్రంలోని రైతన్నలు, నేతన్నలు భారీగా నష్టపోతారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతన్నతో పాటు సిరిసిల్లలోని నూతనలు కూడా సబ్సిడీ లేకుండా చావు దెబ్బ తింటారు. సంక్షోభంలోకి పోతారు
• ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడంతో ముందు డబ్బులు కడితేనే విద్యుత్తు లభిస్తుంది
• ప్రవేట్ కంపెనీలు విద్యుత్ పంపిణీ రంగంలోకి దిగితే పెట్రోల్ రేట్ల మాదిరి రోజురోజుకి విద్యుత్ రేట్లు మారుతాయి. విద్యుత్ రేట్లు అడ్డగోలుగా భారీగా పెరుగుతాయి
• నల్ల చట్టాల మాదిరే విద్యుత్ చట్టాలను బలవంతంగా దేశ ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు
• ఉచితాలు రద్దు చేయాలంటూ మాట్లాడుతున్న ప్రధానమంత్రి తన కార్పొరేట్ మిత్రులకు లక్షల కోట్లు మాఫీ చేసినారు
• రైతులకి ప్రోత్సాహాకాలు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నది
• కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు… పేదలను కొట్టి పెద్దలకు వేసే ప్రయత్నం జరుగుతుంది
• వచ్చే సీజన్ నుంచి ధాన్యం సేకరణలో ప్రైవేట్ కంపెనీలు వచ్చే ప్రమాదముంది
• తెలంగాణ వడ్లు కొనుమంటే భారీగా నిలువలు ఉన్నాయన్న కేంద్రం ఈరోజు ఆహార ధాన్యాల కొరత ఉందని చెబుతున్నది. మొన్నటికి మొన్న నాల్గేండ్ల వరకు నిల్వలు ఉన్నాయని బొంకిన, సిగ్గులేని కేంద్రం ఈరోజు ఎగుమతులను రద్దు చేసింది
• ఎట్టి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టాలను అంగీకరించమని ముఖ్యమంత్రి రైతాంగం పక్షాన నిలబడ్డ్డారు
• రైతుల మోటార్లకు మీటర్లు పెడితే 25 వేల కోట్ల రూపాయల వరకు రుణాలు ఇస్తామన్నా… మా ముఖ్యమంత్రి రైతుల పక్షాననే నిలబడ్డారు
• మా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు వ్యవసాయన్ని దివాళ తీయించడం, గల్లీకొక కరెంట్ పంపిణీ కంపెనీని పెట్టి సమాజంలోని సబ్సిడీ మరియు ఉచిత విద్యుత్తుని అడ్డుకునే కేంద్రం కుటీల బుద్ధిని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి
• రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని విభేదాలను పక్కనపెట్టి ఏకోన్ముఖంగా కేంద్రానికి మన నిరసన తెలిపాలి
• ఈ విషయం పైన ప్రజలను జాగృతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను