మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక

ధర్మపురి( జనం సాక్షి)ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పలువురు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. సీ ఎం కేసీఆర్ ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న సంక్షేమ అభి వృద్ది కార్యక్రమాలకు ఆకర్శితులమై గులాబీ పార్టీ లో చేరుతున్నట్లు చెప్పారు. నవంబర్ 30న జరగ నున్న అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ ను అత్యధిక మెజారిటీ తో గెలిపించు కుంటామని చెప్పారు.పార్టీలో చేరిన వారికీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. బీఆర్ ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకోవడం పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతోషం వ్యక్తం చేశారు.