మంథనిలో మాజి ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 31: మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశం మేరకు మంథని మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, టౌన్ అధ్యక్షులు పోలు శివ,వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. మంథనిలో ఘనంగా వారి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనగామ నర్సింగరావు, పేరవేన లింగయ్య యాదవ్, కుడుదుల వెంకన్న, కౌన్సిలర్ పెండ్రు రమా సురేష్ రెడ్డి, మంథని సత్యం, పార్వతి కిరణ్ తోపాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.