మంథనిలో 23వ తెలంగాణ వేద విధ్వ విద్వన్మహా సభలు

ఈ నెల 2 నుండి 5 వరకు నిర్వహణ
జనంసాక్షి, మంథని, అక్టోబర్ 31:
వేద విద్యలకు పట్టుకొమ్మ అయిన మంథని అగ్రహారంలో ఈ నెల 2 నుండి 5 వరకు శ్రీ జనార్ధనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ నిర్వహించనున్న 23వ తెలంగాణ వేద విద్వన్మహా ఘనంగా ప్రారంభం కానున్నాయి. శ్రీ సీతారామ సేవా సదన్, మంథని బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కాల ప్రభావంచే తెలంగాణ ప్రాంతంలో క్షీణిస్తున్న వేద విద్యకు పూర్వవైభవ స్థితి తెచ్చేందుకు శ్రీ స్వామి వారి ఆశయమును సహకారం చేయుటకు 2002 లో శ్రీ జనార్ధనానంద సరస్వతి స్వామి ఈ ట్రస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు జరిగిన 22 వార్షిక వేద సభలు ద్వారకా పీఠాధిపతులు శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామి, శ్రీ కంచి సర్వజ్ఞ పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, శ్రీ నృసింహ భారతి స్వామి, శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి, శ్రీ కృష్ణానంద సరస్వతి స్వామి, శ్రీ మాధవానంద సరస్వతి స్వామి, శ్రీ చిన జీయర్ స్వామి, సద్గురు శ్రీ శివానందమూర్తి వంటి మహానుభావుల అనుగ్రహ భాషతో నిర్వహించబడి ఆశీర్వదింపబడింది. ఈ సభలకు తెలంగాణ ప్రాంతమునకు చెందిన వేద విద్వాంసులు 150 మంది అలాగే వేద విద్యార్థులు 450 మంది హాజరుకానున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు గట్టు నారాయణ గురూజీ, కెవిఎల్ ఎన్ హరిబాబు, దుద్దిల్ల గణపతి, నల్లగొండ హరి, పల్లి ప్రహ్లాదులు తెలిపారు. ఈ 4 రోజుల పాటు వేద విద్వాంసులు సంపూర్ణ శుక్ల యజుర్వేద స్వాహాకార హవనము వేద స్వస్తి నిర్వహించనున్నారు ప్రముఖ వేద శాస్త్ర పండితులచే ఉదయం ఉపనిషత్ ఉపనిషత్భాష్య ప్రవచనములు అలాగే సాయంత్రం పండిత గోష్టి బహిరంగ సభ నిర్వహించబడునని వారు తెలిపారు. 5 వ తేదీ ఆదివారం వేద విద్వాంసులకు, విద్యార్థులకు సత్కారం చేయనున్నట్లు కర్నే హరిబాబు తెలిపారు. మంథని పట్టణంలోని నృసింహ శివ కిరణ్ గార్డెన్ లో ఈ సభలు నిర్వహించనున్నారు.