మంథని డివిజన్ అసెంబ్లీ ఎన్నికల మీడియా కన్వీనర్ గా ఇనుముల సతీష్

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 28 :
అసెంబ్లీ ఎన్నికల మీడియా మంథని డివిజన్ కన్వీనర్ గా మంథని కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇనుముల సతీష్ ను నియమిస్తూ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర ఉత్తర్వులు జారీ చేయగా శనివారం మంథని లో ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా నియామకం ఉత్తర్వులు అందించారు. మంథని డివిజన్ లోని మంథని, రామగిరి, ముత్తారం, కమాన్ పూర్ మండలాల్లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయడానికి గాను అవసరమైన మీడియా సహకారాన్ని తీసుకొని కృషి చేయాలని కోరారు. కాగా తన నియామకానికి కృషి చేసిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి,
జిల్లా అధ్యక్షులు కి, దుద్దిళ్ల శ్రీను బాబు కి, మంథని డివిజన్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఇనుముల సతీష్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా నూతనంగా మంథని డివిజన్ అసెంబ్లీ ఎన్నికల కన్వీనర్ గా నియమితులయిన ఇనుముల సతీష్ ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, ప్రచార కమిటీ కన్వీనర్ ఓ.శ్రీనివాస్, సీనియర్ నాయకులు నూకల బానయ్య, గోటికార్ కిషన్,కుడుదుల వెంకన్న,అయిలి శ్రీనివాస్,ఎల్లంకి వంశీలతో పాటు ఇతర నాయకులు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు.