మట్టి వినాయకులనే పూజించాలి కార్పొరేటర్

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 27
అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ లోని జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిన మట్టి వినాయకులను ప్రజలకు అందజేసిన కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్
శనివారం సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను పూజించాలని సూచించారు. మత సమరసంతో పండుగలు జరుపుకోవాలని కోరారు. మట్టి వినాయకులను ప్రతిష్టించుకొని పూజించాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు భాస్కర్, అనంతుల సంతోష్, ఈఎస్ లక్ష్మణ్, శివ, పెంటన్న, మల్లేష్, జమందర్, మైవన్, సుధేష్, నరేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.