మట్టి వినాయకులనే పూజిద్దాం..

పర్యావరణాన్ని కాపాడుకుందాం
– రంగసాయిపేటలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 30(జనం సాక్షి)
ప్రతి ఒక్కరం మట్టి వినాయకులనే ప్రతిష్టించి పూజించాలని భద్రకాళి మహిళా సంక్షేమ మండలి అధ్యక్షురాలు పోతు రమాదేవి అన్నారు. మంగళవారం వరంగల్ నగరంలోని రంగసాయిపేటలో భద్రకాళి మహిళా సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సాంప్రదాయబద్ధమైన మట్టి వినాయకులను భక్తిశ్రద్ధలతో పూజించాలని అన్నారు. ప్రతి ఏటా ఇలాగే మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భద్రకాళి మహిళ సంక్షేమ మండలి బాధ్యులు, సభ్యులు గజ్జి రమాదేవి, చిట్ల సంధ్యారాణి, కాబట్టి రమాదేవి, బజ్జురి జయ గౌరీ, ఆకుతోట అనుష, మిట్టపల్లి రమాదేవి, మాటేటి శారద, తిరునగరి గీత, పోతు ధనలక్ష్మి, వంగ అనూష, సకినాల సునీత, చిమ్మని భార్గవి, కుసుమ కవిత, తదితరులు పాల్గొన్నారు