మత్స్యకారులకు పెరిగిన ఉపాధి: ఎంపి

ఆదిలాబాద్‌,జూన్‌30(జ‌నం సాక్షి): మిషన్‌ కాకతీయతో చెరువుల్లో నీరు చేరడంతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరిగాయని ఎంపి గోడం నగేశ్‌ అన్నారు. గతంలో 50 శాతం రాయితీతో చేప పిల్లలను పంపిణీ చేయగా.. తాజాగా ప్రభుత్వం వందశాతం రాయితీతో ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు మంత్రి జోగురామన్న అన్నారు. చేప పిల్లల పంపిణీతో పాటు మార్కెట్‌సౌకర్యం సైతం కల్పించడంతో చేతినిండా పని దొరుకుతుందని వివరించారు. గత ప్రభుత్వాలు మత్స్యకారుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించాయని.. తమ ప్రభుత్వం వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. చేపల వేటలో ప్రమాదవశాత్తు మరణిస్తే గ్రూపు ఇన్సురెన్సు కింద అందజేసేపరిహారాన్ని రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షలను పెంచుతూ తమ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తుచేశారు. మత్స్యసహకార భవన నిర్మాణానికి రూ.10లక్షలు, చేపల మార్కెట్‌ నిర్మాణానికి రూ.10లక్షలు అందజేస్తామని పేర్కొన్నారు.

 

తాజావార్తలు