మద్యం బినావిూల వార్త అసంబద్దం

నిరూపిస్తే రాజీనామాకు సిద్దం
డిప్యూటీ సిఎం నారాయణ స్వామి
చిత్తూరు,ఆగస్ట్‌1 జ‌నంసాక్షిః  విజయవాడలో తనకు మద్యం షాప్‌ల బినావిూలు ఉన్నట్లు వచ్చిన ఆరోపణలను డిప్యూటీ సిఎం నారాయణ స్వామి ఖండిరచారు. కొందరు పనిగట్టుకుని తనపై ఆరోసణలు చేస్తున్‌ఆనరని, అసత్య వార్తలు రాయిస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే తన బినావిూలు ఎవరో బయటపెట్టాలని నారాయణస్వామి సవాల్‌ విసిరారు. ఎస్‌ఆర్‌ పురం మండలంలోని జిఎంఆర్‌ పురం గ్రామ పంచాయతీ దాసరి గుంటలో డిప్యూటీ సిఎం నారాయణ స్వామి ’గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జగనన్న పాటకు తన్మయత్వంతో మహిళలతో కలసి నారాయణ స్వామి నృత్యం చేసి అందరినీ ఉత్సాహపరిచారు. గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తనపై తప్పడు వార్తలు రాయించారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాసే నీచపు బుద్ధి మానుకోవాలన్నరు. ఓ పత్రికలోతనపై వచ్చిన తప్పుడు కథనంపై పరువునష్టం దావా వేస్తానని అన్నారు. ఈ`వేలం ద్వారా బార్లకు లైసెన్స్‌లు పొందుతున్నారు. నిబంధనలు ప్రకారం వేలం జరుగుతుంటేఎల్లో విూడియా వారు ఓర్వలేకపోతున్నారు. ఇది నిజమని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ నారాయణస్వామి విసిరారు.