మధ్యాహ్న భోజనం తనిఖీ

మండలంలోని కిష్టాపురం జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని మంగళవారం ఆకస్మికంగా ఎంపీటీసీ భీమనపల్లి సైదులు తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా,విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇస్తున్నారా అనే విషయంపై వంట ఏజన్సీలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం పాఠశాలలోని రికార్డులు పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.ఈకార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అంజిరెడ్డి, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు .