మనసుకు ప్రశాంతతనిచ్చేదియోగా

బిజెపి మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి

మల్దకల్ జూన్ 21(జనం సాక్షి) ప్రపంచయోగా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని దేవాలయం గ్రౌండ్ లో  మండల బీజేపీ పార్టీ యోగ కన్వీనర్ దామ వెంకటేష్, కో కన్వీనర్ కిషోర్ ఆధ్వర్యంలో యోగ చేశారు.మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు అల్వాల రాజశేఖర్ రెడ్డిముఖ్య అతిథిగా హాజరై యోగ డేను జరుపుకున్నారు.ఈ సందర్బంగా అధ్యక్షులు అల్వాల రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ యోగ నిత్యజీవితంలో ఒక భాగం కావాలని,యోగ చేస్తూ ఆరోగ్య నియమాలు పాటిస్తూ,ప్రకృతి లో సహజంగా లభించే ఆయుర్వేద చిట్కాలు పాటిస్తూ ఆరోగ్యవంతమైన జీవితం గడపాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దామ నాగరాజు, వెంకటేశ్వర రెడ్డి, తిరుపతి రెడ్డి,లక్ష్మీ నారాయణ, గోవర్ధన్,సందీప్ రెడ్డి, కృష్ణా రెడ్డి, తిరుమలేష్, తదితరులు పాల్గొన్నారు.