మన్మోహన్ లాంటి చదువుకున్న ప్రధాని కావాలి
– ఢిల్లీ సీఎం కేజీవ్రాల్ వ్యాఖ్యలు
– ట్విట్టర్ వేదికగా మోడీపై పరోక్ష విమర్శలు చేసిన క్రేజీవాల్
న్యూఢిల్లీ, మే31(జనం సాక్షి) : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై మరోసారి మాటల దాడికి దిగారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్. ట్విటర్ వేదికగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను పొగుడుతూ.. ప్రధాని మోదీపై పరోక్ష విమర్శలు చేశారు. మన్మోహన్ లాంటి ప్రధానిని ప్రజలు కోల్పోయారు అని వ్యాఖ్యలు చేశారు. రూపాయి పతనం దేశీయ పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే అంశంపై ఓ ఆంగ్ల విూడియా కథనం రాసింది. ఈ కథనాన్ని కేజీవ్రాల్ గురువారం తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై పరోక్ష విమర్శలకు దిగారు. డా. మన్మోహన్ సింగ్ లాంటి విద్యావంతుడైన ప్రధానిని ప్రజలు కోల్పోయారన్నారు. ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రధానిని కోరుకుంటున్నారు. దేశ ప్రధానమంత్రి కచ్చితంగా విద్యావంతుడై ఉండాలి అని కేజీవ్రాల్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ డిగ్రీ నకిలీదంటూ గతంలో కేజీవ్రాల్ ఆరోపణలు చేశారు. తాజాగా మరోసారి ఇదే విషమయై పరోక్షంగా విమర్శించారు. ఇదిలా ఉండగా, తాజా ట్వీట్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ప్రశంసలు కురిపించిన కేజీవ్రాల్.. గతంలో ఆయనను కూడా విమర్శించడం గమనార్హం. 2013లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై విమర్శలు చేసిన కేజీ.. అప్పటి ప్రధాని మన్మోహన్ను ధృతరాష్టుడ్రితో పోలుస్తూ ట్వీట్లు చేశారు.