మన లక్ష్యం మన ఎజెండా ఒక్కటే అది బాల్క సుమన్ ఓటమి

ధైర్యం చేడద్దు.. లక్ష్యం మరువద్దు.. చెన్నూరు ప్రజలకు అండగా నేనుంటా

చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు

చెన్నూరు నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని, నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సీట్ కేటాయింపు పై త్వరలో శుభ వార్త వస్తుంది అని చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండవ జాబితా విడుదల చేసిన సందర్భంగా చెన్నూరు నియోజకవర్గ అభ్యర్ధిని ప్రకటించకపోవడం తో నియోజకవర్గ ప్రజలు కొంత ఆందోళనకు గురి కావడం జరిగింది అని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అన్నారు. నియోజకవర్గ సీటు పొత్తులో భాగంగా సీపీఐ కి కేటాయించిన, కాంగ్రెస్ నుండి అభ్యర్ధిని ప్రకటించిన మన లక్ష్యం ఒక్కటే అని, అందరం ఐక్యంగా నియోజకవర్గం లో ప్రజలను బానిసగా చూస్తున్న దొర దత్త పుత్రుడు బాల్క సుమన్ ను తరిమికొట్టడం అని తెలిపారు. మన అందరం కలిసి మళ్ళీ సంబరాలు చేసుకునే సమయం ఒక్కటి రెండు రోజుల్లో వస్తుంది అని, అందరం కలిసి కేవలం 40 రోజులు కష్టపడితే రానున్న ఐదు ఏండ్లు ఆనందంగా గడపవచ్చు అని అన్నారు. ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు లక్ష్యాన్ని మరవకుండ సుమన్ ఓటమి ధ్యేయంగా పని చేయాలని కోరారు. మీ సేవకుడిగా.. మీలో ఒక్కడిగా.. స్థానిక సింగరేణి బిడ్డగా.. చెన్నూరు గడ్డపై ఎన్నికలో బరిలో వుంటాను అని తెలిపారు..