మరో 13పైసలు తగ్గిన పెట్రోలు

న్యూఢిల్లీ,జూన్‌5(జనం సాక్షి): అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధర తగ్గుతున్న నేపథ్యంలో మరికొన్ని పైసల ధరను తగ్గించారు. పైసలవారీగా ఏడవరోజు మంగళవారం లీటర్‌ పెట్రోల్‌పై 13 పైసలు తగ్గించగా, డీజిల్‌పై 9 పైసలను చమురు సంస్థలు తగ్గించాయి. దీంతో మంగళవారం పెట్రోల్‌ ధర లీటరు రూ.77.83 ఉండగా, డీజిల్‌ రూ.68.88గా ఉంది. గత నెల 30న పైసా తగ్గించగా విమర్శలు ఎదురయ్యాయి. ఈ నెల మొదటి తేదీ నుంచి ఇప్పటి వరకు లీటర్‌ పెట్రోల్‌పై 39 పైసలు, డీజిల్‌పై 28 పైసలు ధరలు తగ్గాయి. స్థానిక అమ్మకపు పన్ను, వాట్‌ టాక్స్‌ ఆధారంగా ఆయా రాష్టాల్లో వీటి ధరలు నిర్దారిస్తారు. మెట్రో నగరాలన్నింటిలో ఒక్క ఢిల్లీలోనే పెట్రోలు, డీజిల్‌ ధరలు తక్కువగా ఉంటాయి.