మల్కాజిగిరిలో బిజెపి జెండా ఎగురవేస్తాం:రాంచందర్ రావు

మల్కాజిగిరి,నవంబర్10(జనంసాక్షి)మల్కాజిగిరి నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగురవేస్తామని బిజెపి అభ్యర్థి ఎన్.రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.శుక్రవారం ఆనంద్ బాగ్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయంలో బిజెపి అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.జనసేన మద్దతుతో అధిష్టానం ఆదేశాల మేరకు బిజెపి అభ్యర్థిగా ఎన్నికలలో బలంగా, ఆత్మవిశ్వాసంతో దిగుతున్నానని అన్నారు.మల్కాజిగిరి నియోజకవర్గం లో ఈసారి బిజెపి జండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో శాంతి,అభివృద్ధి కరువైందని దీనికోసం పోరాడుతున్నామని తెలిపారు. వినాయక నగర్ డివిజన్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి,టీం సాయి,ఆర్కే శ్రీనివాస్, జనసేన నాయకులు పాల్గొన్నారు.