మళ్లీ హోటల్‌కు తరలిన జెడి ఎమ్మెల్యేలు

బెంగుళూరు,మే19( జ‌నం సాక్షి): కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా చేసిన తర్వాత జేడీఎస్‌, కాంగ్రెస్‌ మధ్య అధికారం కోసం చర్చోపచర్చలు ముమ్మరమయ్యాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఇటీవల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను హోటళ్ళకు తరలించడంలో కీలక పాత్ర పోషించిన డీ కే శివ కుమార్‌ను రాహుల్‌ గాంధీ పక్కనబెడుతున్నట్లు తెలుస్తోంది. శివ కుమార్‌ ఉప ముఖ్యమంత్రి పదవిని కోరుతుండగా రాహుల్‌ గాంధీ అందుకు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు 36 మంది జేడీఎస్‌ ఎమ్మెల్యేలను ఓ ప్రముఖ 5 స్టార్‌ హోటల్‌  ఆ పార్టీ తరలించినట్లు తెలుస్తోంది. వారి కోసం ఆ హోటల్‌లో 60 విలాసవంతమైన గదులను బుక్‌ చేసినట్లు సమాచారం.
——